Saturday, April 20, 2024

షర్మిల బీజేపీ వేసిన బాణమని ప్రజలకు తెలుసు.. మంత్రి కొప్పుల

షర్మిల బీజేపీ వేసిన బాణం అని ప్రజలకు తెలుసని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వద్దని కొట్లాడింది దివంగత నేత వైఎస్ఆర్ అని తెలిపారు. వైఎస్ఆర్ ఉండివుంటే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదన్నారు. బీజేపీ ప్రోత్సాహంతోనే వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడం ఆపకపోతే పరిస్థితి బాగుండదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో షర్మిల అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement