Thursday, April 25, 2024

డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు రూ.14 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో జూన్‌ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు పెండింగ్‌ వేతనాలకు సంబంధించిన రూ.14,14,14,600 నిధులను కాలేజియెట్‌ కమిషనర్‌ విడుదల చేశారు.

గత నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు దసరా పండుగ ముందు వేతనాలను విడుదల చేయడంపై ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement