Thursday, March 28, 2024

రెండేళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం: గండ్రజ్యోతి

రెండేళ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తెలిపారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో మహిళలకు గ్రామ సర్పంచ్ పువ్వటి రాణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కోలాట పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గండ్ర జ్యోతి పాల్గొని మహిళతో కలిసి కోలాటం ఆట పాటలలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుంటూరు పల్లి గ్రామం అందరికీ ఆదర్శమని అన్నారు. పాడి పంటలు చెట్లు చేమతో పాటు ప్రజలు ఓకే కుటుంబంలా కలిసి ఉంటారని తెలిపారు. ఈ గ్రామంపై ఎమ్మెల్యే గండ్రకు ప్రత్యేక అభిమానం ఉంటుందన్నారు. 

భూపాలపల్లి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గండ్ర సారథ్యంలో అభివృద్ధిపథంలో ఉండేలా ఎల్లవేళలా  కృషి చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు ప్రజలు జీవనోపాధికి వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరంతో సాగు, త్రాగునీరు, 24 గంటల విద్యుత్ పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement