Thursday, April 18, 2024

తీరు మారక పోతే పీడీ యాక్ట్ .. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్..

పెద్దపల్లి ప్ర‌భ‌న్యూస్ : గతంలో నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తనతో వుండాలని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని పెద్దపల్లి ధర్మారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల 138 మంది రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు.

తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. మంచిగా జీవిస్తే భవిష్యత్తులో షీట్లు తొలగిస్తామని, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సైలు రాజేష్, రాజ వర్ధన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement