Wednesday, April 17, 2024

ప్రారంభమైన వడ్ల కొనుగోళ్లు.. ఆంధ్రప్రభ కథనానికి స్పందన

వరంగల్​ జిల్లా చెన్నారావుపేటలో వడ్ల కొనుగోళ్లు ఇవ్వాల (ఆదివారం) ప్రారంభించారు. నిన్న ఆంధ్రప్రభలో వచ్చిన వార్తతో స్పందించిన అధికారులు వెంటనే కొనుగోళ్లు చేయడానికి చర్యలు తీసుకున్నారు. చెన్నరావుపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారాభించని కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రభ దినపత్రిక “ప్రారంభం కానీ కొనుగోళ్లు ఆందోళనలో అన్నదాతలు”అనే శీర్షికన వార్త ప్రచురించింది. ఈ విషయాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. దీంతో అన్నదాతలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు అండగా నిలవాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement