Friday, April 19, 2024

వడ్ల లారీ బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

దోమకొండ (ప్రభ న్యూస్) : కామారెడ్డి​ జిల్లాలో ప్రమాదం జరిగింది. 540 వడ్ల బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దోమకొండ కొనుగోలు కేంద్రంనుండి శ్రీసాయి మణికంఠ రైస్ మిల్ కు తరలిస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్​ జరిగింది. జనగామ మర్రి వద్దనుండి మార్గమధ్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో వంతెన నిర్మాణం ప్రాంతంలో వడ్ల లారీ బోల్తా పడింది. సంబంధిత లారీ రైస్ మిల్ యాజమాన్యం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కాగా, లారీలోని డ్రైవర్ క్లీనర్ లకు ఎలాంటి హాని జరగలేదని తృటిలో ప్రమాదం తప్పిందని వారు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement