Thursday, April 25, 2024

దేశంలో అత్యధిక జీతాలు తీసుకుంటున్నది మన ఉద్యోగులే.. కేసీఆర్

దేశంలో అత్యధిక జీతాలు తీసుకుంటున్నది మన ఉద్యోగులేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈసందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ… జగిత్యాల కలెక్టరేట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తెలంగాణలో కారు చీకట్లు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు డెవలప్ మెంట్ లో దూసుకెళ్తున్నామన్నారు. అనేక రంగాల్లో దేశంలో మనమే నెంబర్ వన్ అని కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాలకు 24గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 33జిల్లాల్లో 33వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement