Friday, April 19, 2024

ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే.. నీళ్ల‌తోనే అభివృద్ధి సాధ్యం అన్న బోయిన‌ప‌ల్లి

ఉద్య‌మంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ రంగాల్లో అపూర్వ విజయాన్ని సాధించామని, ఇక మిగతా విషయాలపై దృష్టిని సారిస్తామ‌ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఓ.యూ ఫౌండేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులను పెంపొందించాలని అన్నారు. నీటి లభ్యత వల్ల వివిధ రకాల పంటలు, ముఖ్యంగా వరి సాగు అంచనాలకు మించి చేతికి వచ్చిందని ఆయన పేర్కన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో దాదాపు 45 వేల చెరువులను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయని, ప్రస్తుతం భూ గర్భంలో సుమారు 500 టీ.ఎం.సీ.ల మేరకు నీటి వనరులు అందబాటులో ఉన్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వినోద్ కుమార్ అన్నారు.

ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా నోటిికేషన్లు విడుదల అవుతాయని అన్నారు. యూనివర్సటీలలో ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఖాళీలు లేకుండా చూడాలని ఆయన వైస్ ఛాన్సలర్ ప్రొ. రవీందర్ కు సూచించారు. రానున్న రోజుల్లో విద్యా, ఆరోగ్యం పై దృష్టిని సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ లోక్ పాల్ కార్యదర్శి భరత్ లాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. తాను దేశ జల వనరుల శాఖ కార్యదర్శిగా పనచేసిన అనుభవంతో విశ్లేషిస్తే తెలంగాణలో నీటి పారుదల రంగంలో గణనీయంగా ప్రగతిని సాధించిందని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఓ.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ. రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, డీన్ మల్లేశం, రెడ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement