Thursday, April 18, 2024

ప్రజారోగ్యం కోసమే ఓపెన్ జిమ్ లు : విప్ బాల్క సుమన్

నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పెద్ద ఎత్తున ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని శ్రీపతి నగర్ జంక్షన్ వద్ద రూ.14 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… ప్రజలందరూ ప్రతినిత్యం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement