Tuesday, April 23, 2024

ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఔటర్ రింగ్ రోడ్డ్ పై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారు శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్ నుండి బయటకు దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి మంటల్లో చిక్కుకొని గాయపడ్డాడు. దీనిని గమనించిన ఇతర వాహనారులు వ్యక్తిని కారు నుంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అంబులెన్స్ లో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి తిమ్మాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ప్రమాదంపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కడెం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement