Friday, April 26, 2024

మర్ధన్‌పేట అండర్‌ టన్నెల్‌లో ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

వేములవాడ, (ప్రభన్యూస్‌): రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని అండ‌ర్ ట‌న్నెల్‌లో ప్ర‌మాదం జరిగింది. కోనరావుపేట మండలం మర్తన్‌పేట ద‌గ్గ‌రున్న‌ అండర్‌ టన్నెల్‌లో ఆడిట్‌-2 కింద 12వ కిలో మీటర్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్‌లో రాయి పడడంతో జరిగిన ఘటనలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు గాయపడినట్లు కార్యనిర్వహక ఇంజనీరు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో యోగేంద్ర కుమార్‌ మేహతో చనిపోయాడు. మిగతా ఇద్దరిని కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. ఘటన వివరాలను ప్యాకేజీ-9 కార్యనిర్వహక ఇంజనీరు శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మృతుడు యోగేంద్ర కుమార్‌ మేహతో కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కలెక్ట ర్‌ ఆదేశించారు. ఖర్చుకు వెనుకాడకుండా ఇద్దరు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement