Thursday, April 25, 2024

ఓలెక్ట్రాకి 100 బ‌స్సుల ఆర్డ‌ర్‌.. అసోం నుంచి అందుకున్న కంపెనీ!

అసోం రోడ్డు ర‌వాణా సంస్థ నుంచి 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లెటర్ ఆఫ్ అవార్డు అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డ‌ర్. ఔట్‌ రైట్ కొనుగోలు ప్రాతిప‌దిక‌న ఈ ఆర్డ‌ర్ ల‌భించింది. వ‌చ్చే తొమ్మిది నెల‌ల్లో ఈ బ‌స్సుల‌ను కంపెనీ డెలివ‌రీ చేయ‌నుంది. అలాగే, ఐదేండ్ల పాటు బ‌స్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయ‌నుంది. ఈ వంద బస్సుల ఆర్డ‌ర్ విలువ రూ. 151 కోట్లుగా ఉంది.

ఈ సంద‌ర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ కేవీ. ప్ర‌దీప్ మాట్లాడుతూ, “ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డ‌ర్ రావ‌డం సంతోషంగా ఉంది. ఈ ఆర్డ‌ర్‌తో దేశం న‌లుమూల‌ల మా బ‌స్సులు న‌డుస్తున్న‌ట్టు అవుతుంది. మా బ‌స్సులు ఇప్ప‌టికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచి కార్బ‌న్ కాలుష్యాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌గ‌లిగాయి.” అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement