Tuesday, April 16, 2024

Breaking: బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు నో ప‌ర్మిష‌న్‌.. భైంసా సున్నిత‌మైన ఏరియా అన్న పోలీసులు

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. నిజామాబాద్​ జిల్లా బైంసా నుంచి రేపు మొద‌లు కావాల్సిన పాద‌యాత్ర‌కు పోలీసులు అడ్డుచెప్పారు. బైంసా చాలా సున్నిత‌మైన ప్రాంత‌మ‌ని, అక్క‌డ స‌భ‌కు కానీ, పాద‌యాత్ర‌కు కానీ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌బోమ‌న్నారు. అంత‌టి సున్నిత‌మైన ప్ర‌దేశంలో ప్రొటెక్ష‌న్ ఇవ్వ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని తేల్చేశారు. దీంతో బండి సంజ‌య్ పాద‌యాత్రకు బ్రేక్ ప‌డ్డ‌ట్టు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement