Thursday, April 25, 2024

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించ‌బోం…. కెసిఆర్

హైద‌రాబాద్ : ‌తెలంగాణ‌లో తిరిగి లాక్‌డౌన్ విధించబోమంటూ ముఖ్య‌మంత్రి కెసిఆర్ శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ,. లాక్‌డౌన్ అనేది పెట్టబోమ‌ని, ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌ద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఆర్థికంగా చాలా దెబ్బ‌తిన్నామ‌ని అంటూ క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని అన్నారు. విద్యార్ధులు క‌రోనా భారీన ప‌డుతుండ‌టంతో బాధ‌తోనే స్కూళ్ల‌ను తాత్కాలికంగా మూసివేశామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. తిరిగి విద్యా సంస్థ‌ల‌ను తెరిచే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొన్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌పై కెసిఆర్ మాట్లాడుతూ,ఈ విష‌యంలో తెలంగాణ‌ రాష్ర్ట ప్ర‌భుత్వం భేష్‌గా ఉంద‌న్నారు. టెస్టుల సంఖ్య‌ను పెంచామ‌ని అంటూ నిన్న ఒక్క‌రోజే 70 వేలు టెస్టులు చేశామ‌ని వెల్ల‌డించారు. అలాగే సినిమా థియేట‌ర్ల యాజమాన్యాల‌కు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించి… కేంద్రం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా థియేట‌ర్ల‌ను ఓపెన్ చేశామ‌ని గుర్తు చేశారు. క‌రోనా వ‌ల్ల మ‌నం ఒక్క‌ర‌మే కాద‌ని, ప్ర‌పంచంలోని అనేక దేశాలు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయ‌న్నారు. క‌రోనా ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా సంవ‌త్స‌ర కాలంగా ప్ర‌పంచాన్ని వేధిస్తోందని అన్నారు. క‌రోనా దెబ్బ‌కు అన్ని దేశాల జీడీపీలు కుప్ప‌కూలాయ‌ని, అయినా మ‌న రాష్ట్రం జీడీపీలో మ‌నం మెరుగ్గా ఉంద‌ని పేర్కొన్నారు. అనేక రాష్ర్టాలు జిడిపి మైన‌స్‌లో ఉన్నాయ‌నే విష‌యాన్ని స‌భ దృష్టికి తెచ్చారు.. కాగా ఇప్ప‌టికే 10.85 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ ఇచ్చామ‌ని చెప్పారు.. వ్యాక్సిన్ ఇచ్చే అంశం కేంద్రం ప‌రిధిలో ఉంద‌ని అంటూ డోసుల త‌యారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ర్టాల‌కు స‌మానంగా పంపిణీ చేస్తోంద‌న్నారు. వ్యాక్సినేష‌న్ అంద‌రికీ వేసేందుకు స‌క‌ల చ‌ర్య‌లు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌దని కెసిఆర్ అని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement