Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మోర్తాడ్ : మోర్తాడ్ మండల శివారులో జాతీ యరహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ సాయి అనే యువకుడు మృతి చెందినట్లు మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ అనే వ్యక్తి కారును నిర్లక్ష్యంగా అతి వేగంగా నడుపుతూ కోరుట్లకు చెంది అటువైపుగా వెళ్తున్న శివ సాయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తలకు తీవ్ర గాయాలైన శివ సాయిని కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి నిర్లక్ష్యంగా కారు నడిపిన జి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement