Tuesday, April 23, 2024

బీర్కూర్ రైతులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

బీర్కూర్, మే2 ప్రభ న్యూస్ : బీర్కూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వడ్లు మొలకలు రావడంతో కొనుగోలు చేయడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎండిన వడ్లను వెంటనే కాంట నిర్వహించాలని కొనుగోలు కేంద్రదారులకు, అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు అదైర్య పడకండి, అన్నివిధాలుగా అండగా ఉంటామని రైతులకు భరోసా కల్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్, ఎంపీటీసీ సందీప్ పటేల్, సొసైటీ అధ్యక్షుడు కొల్లి గాంధీ, ద్రోణవల్లి అశోక్, లాడిగామా గంగాధర్, కొరిమి రఘు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement