Thursday, April 25, 2024

సర్పంచ్ భర్త మృతి.. ఎమ్మెల్యే నివాళి..

నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని చినూరు గ్రామ సర్పంచ్ మాసగళ్ల సౌందర్య భర్త లక్ష్మీనారాయణ వయసు (35) సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులతో కలివిడిగా ఉండే లక్ష్మీనారాయణ అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నిరోజులుగా కాలునొప్పితో ఆరోగ్య పరిస్థితి బాగోలేక బాధపడుతూ ఉండేవాడని, చికిత్స నిమిత్తం హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళాడని, చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆయన నివాసానికి వెళ్లి మృతుదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉండి ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, ఎంపీపీ దివిటీ రాజ్ దాసు, నాయకులు పర్వత్ రావు, హనుమంత్రెడ్డి, చెట్టుకింద శ్రీనివాస్, సంజీవులు, ప్రవీణ్ కుమార్, బిట్ల మురళి, బండ బాబు, మోతే శ్రీనివాస్, కిరణ్ కుమార్, సంతోష్ గౌడ్, ధారబోయిన కృష్ణ, దేశబోయిన సాయిలు, ధనుంజయ్, కృష్ణారెడ్డి, శ్రీధర్ గౌడ్, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement