Friday, April 26, 2024

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యా యత్నం.. చిన్నారులు మృతి..

బాన్సువాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య యత్నం చేయ‌గా.. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బాన్సువాడ సమీపంలో గల వాగులో ముందుగా తల్లి అరుణ త‌న పిల్లలను ప‌డేసింది. తల్లి కూడా దూక‌బోయే సమయంలో గమనించిన స్థానికులు హుటాహుటిగా వాగులో దూకి పిల్లలను వెలికి తీసి తల్లి, పిల్లలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ చిన్నారులు ఇద్ద‌రు మృతి చెందారు. వీరు నిజామాబాద్ గుల్లగుట్ట తండాకు చెందిన వ్యక్తిగాలుగా తెలిసింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం అయ్యిండొచ్చ‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement