Thursday, April 25, 2024

కామారెడ్డి జిల్లాలో విషాదం.. బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకొంది. గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు మోసం గర్భవతిని చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత దుర్గం చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో శిశువును బాధితురాలు వదిలేసింది.

అనంతరం బాధితురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. బావిలో నుండి మృతదేహన్ని వెలికితీసి పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ముళ్ల పొదల్లో ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో ఆ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన నిందితుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement