Tuesday, April 16, 2024

నిజామాద్ జిల్లాలో భారీ చోరీ.. ఇంట్లో వాళ్లంతా దాబా ప‌డుకుంటే..

సిరికొండ, (ప్రభ న్యూస్) నిజామాబాద్‌ జిల్లాలో భారీ చోరీ జ‌రిగింది. సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో నిన్న (ఆదివారం) అర్ధ రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలిపారు. దాదాపు ఆరు ఇళ్ల‌ల్లో దొంగ‌లుప‌డి 50 తులాల బంగారంతో పాటు పెద్ద మొత్తంలో నగదు దొంగిలించినట్లు తెలిసింది. అయితే..
ఇంట్లోని వారంతా ఉక్క‌పోత భ‌రించ‌లేక దాబా పైన నిద్రిస్తున్న‌ సమయంలో దొంగ‌లు చేతివాటం చూపారు. కాగా, దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు .. పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement