Tuesday, April 23, 2024

అత్తారింటి వేధింపులకు వివాహిత బలి..

ఆర్మూర్ : భర్త వేరొక స్త్రీతో పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా వివాహిత ఆత్మహత్య య‌త్నం చేసుకుంది. చికిత్స పొందుతూ వివాహిత‌ మృతి చెందిన సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో కలకలం రేపింది. పెర్కిట్ గ్రామానికి చెందిన ఉప్పునూతల శివకుమార్ గౌడ్ తో గత ఆరు సంవత్సరాల క్రితం సిరికొండ మండలం గడుకోల్ గ్రామానికి చెందిన పల్లవికి వివాహం జరిగింది. తదనంతరం వారికి ఇరువురు కుమారులు పుట్టారు. ఇటీవలి కాలంలో భర్త శివకుమార్ గౌడ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో దీనిని సహించలేని భార్య పల్లవి అతనిని ప్రశ్నించింది. దీంతో తన భార్యను మానసికంగా శారీరకంగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం భార్య భర్తల ఇరువురి మధ్యన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో పల్లవి యాసిడ్ సేవించి ఆత్మహత్యకు ఒడికట్టింది. వెంటనే భర్త శివకుమార్ గౌడ్ ఆర్మూర్ లోని ఆశ ఆసుపత్రికి చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లవి మృతి చెందడంతో ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు శివకుమార్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆస్పత్రి వద్దకు న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన మీడియాపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా గొడవ చేయడం గమనార్హం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సురేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement