Sunday, April 14, 2024

తెలంగాణ యూనివర్సిటీ రజత పతక విజేతకు సన్మానం

నిజామాబాద్ స్పోర్ట్స్ మార్చ్ 28 (ప్రభా న్యూస్)- 20 – 22 వరకు ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వంచల్ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ వుమెన్స్ టోర్నమెంట్ -2023 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి న రజత పథకం సాధించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్ధిని పవర్ ఉమ వైస్ చాన్సలర్ ప్రో. డి. రవిందర్ గుప్తా , రిజిస్ట్రార్ ప్రొ. బి. విద్యావర్ధిని ఘనంగా సన్మానించారు.గిరాజ్ కళాశాలలో బి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవర్ ఉమ 50 కిలోల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పథకం సాధించి తెలంగాణ యూనివర్సిటీ కీర్తి పెంపోందిచడం అభినంద నీయమని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని వైస్ చాన్సలర్ ప్రొడి. రవిందర్ గుప్తా, రిజిస్ట్రార్ ప్రొ. బి. విద్యా వర్ధిని లు ప్రశంసిస్తూ అభినందించారు. యూనివర్సిటీ చరిత్రలోనే మొట్ట మొదటి పథకం సాధించినందుకు చాలా గర్వంగా ఉందని, అనేక మంది క్రీడా కారులు ప్రతిరోజు తమ నైపుణ్యతలను పెంపొందించుకొని ఇంకా అనేక పథకాలు సాధించాల ని వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ , గేమ్స్ టి. సంపత్ ఉమ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోచ్ పి. శ్రీనివాస్ గిరాజ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్. బి. బాలమని వర్సిటి క్రీడా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) డాక్టర్. బి. ఆర్ నేత , కిక్ బాక్సింగ్ క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement