Thursday, March 28, 2024

కామారెడ్డి జిల్లాలో కత్తిపోట్ల కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ప్లాట్‌ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ విగ్రహ సమీపంలో ప్లాట్ విషయంలో గొడవపడి స్వామి అనే వ్యక్తి నరేందర్ రావు, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడిలో నరేందర్ రావు, సంతోష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు స్వామి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement