Thursday, April 18, 2024

Breaking: ఇరిగేషన్ ఇంజినీర్ ఆత్మహత్య

ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నవీపేట్ మండలం పోతంగల్‌లో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బైక్‌పై వెళ్లిన ఆయన గోదావరి వద్ద బైక్‌ను వదిలివేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు నదిలో ఆయన మృతదేహం లభించడంతో.. వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement