Wednesday, April 17, 2024

పెద్ద జనుము విత్తనాల కోసం బారులుతీరిన రైతన్నలు

బిక్కనూరు : పెద్ద జనుము విత్తనాల కోసం రైతులు సోమవారం బారులు తీరారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం పెద్ద జనుము విత్తనాలను సరఫరా చేసింది. వీటిని రాయితీపై సొసైటీ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విత్తనాల కోసం ఎండను సైతం లెక్కచేయకుండా బారులుతీరారు. గంటల తరబడి క్యూ లో నిలిచి ఉండి విత్తనాలు కొనుగోలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement