Friday, March 29, 2024

ఆలయ నిర్మాణానికి సహకారమందిస్తా : ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

సిరికొండ, మార్చి 27 (ప్రభ న్యూస్) : సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామ పరిధిలోని పొట్ల గుట్ట పై దేవధాయ శాఖకు చెందిన 12 లక్షల రూపాయలతో చేపట్టనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చీమన్ పల్లి, హుస్సేన్ నగర్ గ్రామాలలో మా ఇంటి కులదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం తన చేతుల మీదుగా శంకుస్థాపనలను జరిపించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంకటేశ్వరస్వామిని స్మరించుకుంటానని తెలిపారు. హుసేన్ నగర్ గ్రమంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంకు సంబంధించి తన పూర్తి సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గోవర్ధన్ బ్రాహ్మగారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గోవర్ధన్ ను హుస్సేన్ నగర్ వీడీసీ సభ్యులు, జాగృతి కార్యకర్తలు శాలువ, పూల మాలతో సత్కరించారు. ఈ కార్యమాలలో జడ్పీటీసీ మాన్సింగ్, సిరికొండ సొసైటీ చేర్మెన్ గంగారెడ్డి, నిజామాబాదు రూరల్ జాగృతి కన్వీనర్ సాయిచరణ్, హుస్సేన్ నగర్ సర్పంచ్ లక్ష్మితిరుపతి,ఎంపీటీసీ గోవర్ధన్,తాళ్ల రామడుగు, కొండూర్, మైలారం గ్రామ సర్పంచులు,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వీడీసీ చేర్మెన్ తినేటి నర్సరెడ్డి, తూంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్,మండల జాగృతి అధ్యక్షుడు జయనంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement