Thursday, April 25, 2024

నిజామాబాద్‌లో వాహనం ఢీకొని చిరుత మృతి

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై వాహనం చిరుతను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో చిరుత‌ అక్కడికక్కడే మృతిచెందింది. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అటవీ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిరుతను దవాఖానకు తరలించారు. ఈఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement