Wednesday, April 24, 2024

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిపై కేసు నమోదు..

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ పై కేసు నమోదయింది. ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ బుక్ మిస్సింగ్ పై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన మొహమ్మద్ ఫరూఖ్ తన తండ్రి MD లేట్ ఇసాక్ కు చెందిన సర్వీస్ మిస్స్ కావడంతో బాధితుడు ప్రజావాణిలో గత నెల 6న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు పిర్యాదు చేశారు. సర్వీస్ బుక్ మిస్సింగ్ నిర్లక్ష్యం వహించిన డిఎం అండ్ హెచ్ఓ సుదర్శన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రూరల్ పోలీసులకు ఆదేశించారు. దీంతో రూరల్ పోలీసులు డిఎంఅండ్ హెచ్ఓ సుదర్శన్ పై 341,504,506 కింద కేసు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement