Wednesday, April 24, 2024

Breaking : బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ మృతి..

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు మండలం బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ పోస్టు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడడంతో హైదరాబాద్ హాస్పిటల్లో సోమవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం పార్తివదేహాన్ని బరంగ్ ఎడ్గి గ్రామంలో గ్రామ ప్రజల దర్శనార్థం ఆమె స్వగృహంలో ఉంచారు. తమ కుటుంబంలోని ఒక నాయకురాలు చనిపోవడం పలువురు నాయకులు కంటనీరు పెట్టారు. మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి స్వరూప, ఎంపీటీసీ సందీప్, అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement