Thursday, April 25, 2024

బాన్సువాడ ఆలయంలో బ్రహ్మోత్సవాలు.. హాజరైన శాసనసభాపతి

బాన్సువాడ, ఫిబ్రవరి 27 ప్రభ న్యూస్ : తెలంగాణ తిరుమల తిరుపతిలో రెండవ రోజు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మాడవీధుల్లో గరుడ శేష వాహనాన్ని నడిపించారు. ‌అదేవిధంగా ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శంభు రెడ్డి ఆలయ అధ్యక్షులు, ‌ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ ‌పోచారం భాస్కర్ రెడ్డి, బీర్కూర్ మాజీ జెడ్పిటిసి ‌ ద్రోణవల్లి సతీష్, అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement