Wednesday, April 24, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన బోధన్ ఉద్యమకారులు

బోధన్ మార్చి 16 ప్రభ న్యూస్. – పీసీసీ రేవంత్ రెడ్డి ని మద్దత్తు కోరిన బోధన్ జిల్లా సాధన ఉద్యమకారులు బోధన్ ప్రత్యేక జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమం లో బాగంగా స్థానిక న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం నాటికి 88వ రోజుకు చేరాయి ఉద్యమం రోజు రోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నేడు నిజామాబాద్ జిల్లా పాదయాత్ర లో ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి ని బోధన్ జిల్లా సాధన కమిటీ ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి బోధన్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు కు మద్దత్తు ఇవ్వవలసినదిగా కోరారు.

విజ్ఞప్తి కి స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చడానికి న్యాయవాదులు చేస్తున్న కృషిని కొనియాడారు తన చేతనైన విధంగా సహకరిస్థామని తెలిపారు. ఈ దిశగా కృషి చేస్తాఅని అన్నారు. రేవంత్ రెడ్ది తదితర రాష్ట్ర నాయకులను కలసిన సమయంలో బోధన్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్ది ఉన్నారు.రేవంత్ రెడ్డి ని కలసి వినతి పత్రం ఇచ్చిన బోధన్ జిల్లా సాధన సమితి ప్రతినిధి బృందం లో స్థానిక న్యావాదులు సిహెచ్.వి హన్మంత రావు,ఎం. గంగారెడ్డి,వీరభద్రప్ప, బాణోత్ రమేష్,నాయక్ సాయిలు,శ్రీధర్ బాబు,అజయ్,అజర్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement