Saturday, April 20, 2024

డబ్బుకోసం స్నేహితుని దారుణ హత్య..

మోర్తాడ్ మండలం : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల శివార్లలో కనగోళ్ళు వెంకట్ దారుణ హత్యకు గుర‌య్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తిని మోర్తాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు గోనురి శేఖర్ అలియాస్ జల్సా శేఖర్ దారుణంగా హత్య చేశాడని ఎస్సై సీహెచ్ ముత్యం రాజు తెలిపారు. కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తి దగ్గర గోనురి శేఖర్ అలియాస్ జల్సా శేఖర్ కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకట్ కోరగా పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి ఉరి శివారులలో తీసుకెళ్లి కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసి పరారయ్యాడు అని ఎస్సై తెలిపారు. కేసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement