Thursday, April 25, 2024

ప్రేమ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం – ప్రియురాలు మృతి..

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ప్రియురాలు మ‌ర‌ణించ‌గా, ప్రియుడి ప‌రిస్థితి విషమంగా ఉంది.. వివ‌రాలలోకి వెళితే, సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన, చింతల్ తండాకు చెందిన సుభాష్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుభాష్‌కు 2 నెలల క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగింది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని యువతి సుభాష్‌ను నిలదీసింది. అనంతరం ఇద్దరు కలిసి క్రిమిసంహ‌ర‌క మందు సేవించారు. స్థానికుల ఇది చూసి వారిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రియురాలు వందన మృతి చెందింది. ప్రియుడు సుబాష్ పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement