Thursday, April 18, 2024

ఐదు ట్రిలియన్ లపై జోకులోద్దు – కెసిఆర్ కి నిర్మలా సీతారామన్ కౌంటర్

హైదరాబాద్ – ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి విషయాలపై జోకులు వద్దని అన్నారు. 2014లో తెలంగాణకు 60వేల కోట్లుగా ఉన్న అప్పు.. ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎలా అయ్యిందని ఆమె ప్రశ్నించారు. హైటెక్ సిటీలోని నొవోటెల్‭లో కేంద్ర బడ్జెట్ పై దూరదర్శన్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న నిర్మలా సీతారామన్ 2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయని వివరించారు గణాంకాలు ప్రాజెక్టులు చూసుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు . కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్ పేర్లను కేంద్రానికి పంపారని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే వాటిని తిరస్కరించామని చెప్పారు. తెలంగాణలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కేసీఆర్ తెలియదని ఎత్తి పొడిచారు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన డేటా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు నో డేటా అవైలబుల్ అని ఎవరికి వర్తిస్తుందో ఆలోచించుకోవాలని కౌంటర్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement