Friday, April 19, 2024

తెలంగాణపై మహమ్మారి పంజా

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. క్రమంగా రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యంగా విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,052 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 778 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం

రాష్ట్రంలో 24,131 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో 16,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,32,581 మంది కరోనా బారిన పడినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.21 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 1.61 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement