Wednesday, April 24, 2024

మంచిర్యాలలో కరోనా మరణమృదంగం

తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.  మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో వరుస కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 42 గంటల వ్యవధిలో 16 మంది కరోనా రోగులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి నిన్న సాయంత్రం 7 గంటల వరకు 12 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్​కు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కాగా, మృతు సంఖ్య పెరుగుతండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: దేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు….24 గంటల్లో 4 లక్షల కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement