Sunday, March 24, 2024

పెట్రోల్‌, డీజిల్‌కు బదులు నీళ్లు.. ప‌ట్టించుకోని అధికారులు, వినియోగ‌దారుల ఆందోళ‌న‌

సూర్యాపేట (ప్రభన్యూస్‌) : పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌, డీజిల్‌కు బదులు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌ రోడ్డులో ఉన్న‌ దుర్గాభవాని బంకు(హెచ్‌పీ)లో శనివారం రాత్రి వినియోగదారులు గమనించారు. బాటిల్‌, బకెట్‌లో పట్టించి చూడగా బకెట్‌ల కొద్ది నీటిలో కొద్దికొద్దిగా పెట్రోల్‌, డీజిల్‌ కలిసి రావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటలుగా అధికారులకు ఫోన్‌ చేస్తూ ఆందోళన చేస్తున్నా కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.

వివాదాల కేంద్రంగా జనగాం క్రాస్‌ రోడ్డులోని ఈ బంకు గతంలో మీటర్లను ట్యాంపరింగ్‌ చేసి వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలో అధికారులు ఈ బంక్‌ని సీజ్ చేశారు. వినియోగదారులను మోసం చేస్తూ నిర్వాహణ చేస్తున్న బంకును పూర్తి స్థాయిలో తెరవకుండా సీజ్‌ చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బంకు యాజమాన్యం ద్వారా మోసపోయిన వినియోగదారులందరినీ కూడబెట్టుకొని ఆందోళన చేస్తామని అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement