Thursday, April 25, 2024

లారీ ఢీకొని ఇద్దరు మృతి

సూర్యాపేట : రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరిని లారీ ఢీకొట్టిన జిల్లాలోని చివ్వెంల మండలం గుంజలూరులో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తర్వాత లారీ అక్కడే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement