Thursday, April 25, 2024

భారీ మెజార్టీతో భ‌గ‌త్ గెలుపు ఖాయం – మంత్రి త‌ల‌సాని..

త్రిపురారం.. నాగార్జున సాగర్‌ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి భగత్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఎన్నిక‌ల ప్ర‌చాంర‌లో భాగంగా ఆయ‌న నేడే . త్రిపురారం మండల కేంద్రంలో ప‌ర్య‌టించారు.. ఇంటింటికి వెళ్లి ఓట్ల‌ను అభ్య‌ర్దించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలతో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలంతా డిసైడ్‌ అయ్యారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ ప్ర‌చారంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement