Thursday, April 25, 2024

ప్రపంచ దేశాలకు రైతుబంధు ఆదర్శం : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

యాదాద్రి : ప్రపంచ దేశాలకు రైతుబంధు పథకం ఆదర్శమని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నాడని చెప్పారు. దేశంలో లేని విధంగా రైతులను రారాజులుగా చేసే అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో దేవుడిగా నిలిచాడనన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి 10 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ నడుపుకుంటూ కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేంద‌ర్ గౌడ్, పరమేశ్వర రెడ్డి, జనగాం పాండు, ఏవి కిరణ్, ఏ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement