Friday, April 19, 2024

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : ప్రజలు అందించే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, ధరణిలో వచ్చే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల టీఆర్ఈఎస్ఏ డైరీ, క్యాలెండర్, వాల్ క్యాలెండర్ల‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులకు ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షులు పి.శ్యాంసుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల బలరాం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె వెంకట్ రెడ్డి, భువనగిరి డివిజన్ అధ్యక్షుడు వి.హరికిషన్, కార్యదర్శి మల్లికార్జున్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు వీరాబాయి, కార్యదర్శి రాంప్రసాద్, చౌటుప్పల్ అధ్యక్షుడు బ్రహ్మయ్య, కార్యదర్శి శర్మ, తహసీల్దార్లు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ నాయకులు శ్రీనివాస రాజు, వెంకట్ రెడ్డి, గిరిధర్, నాగలక్ష్మి, జయమ్మ, షేక్ సైదా సాహెబ్, జ్యోతి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement