Saturday, April 20, 2024

6.50 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించేందుకు ప్ర‌ణాళిక‌లు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్‌, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి.. కృష్ణమ్మకు సారె సమర్పించారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. జులై నెలలో నీటిని విడుదల చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటి సారని చెప్పారు.

మొత్తం 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.16 లక్షల ఏకరాలలో పంట సాగవుతున్నదని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 వేల ఎకరాలు సాగుబడిలో ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement