Friday, April 19, 2024

Munugode Bypoll : ఓటింగ్‌ బహిష్కరణ.. హామీ ఇస్తేనే ఓటు వేస్తాం.!!

నల్గొండ : చౌటుప్పల్‌ మండలం రంగంతండాలో స్థానికులు ఓటింగ్‌ బహిష్కరించారు. రోడ్డు సౌకర్యం కల్పించలేదని తండావాసుల నిరసన వ్యక్తం చేశారు. హామీ ఇస్తేనే ఓటు వేస్తామని గ్రామస్తులు అంటున్నారు. మునుగోడులో కొన్ని చోట్ల పైసలు ఇవ్వలేదని ఓట్లు వేయమని బహిష్కరిస్తున్నారు. ఈ తరుణంలో రంగంతండాలో సమస్యలు పరిష్కరిస్తామని నేతలు హామీ ఇస్తేనే ఓటు వేస్తానని చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. ఊరంతా ఏకమై ఓటింగ్‌ బహిష్కరించడం పట్ల వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement