Thursday, April 25, 2024

రైతుల గుండెల్లో కేసీఆర్ దేవుడు: ఎమ్మెల్యే ఫైళ్ల

రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ప్రపంచ చరిత్రలో నిలచిపోనుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎడ్ల బండిపై కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నల గుండెల్లో దేవుడిగా సీఎం కేసీఆర్ నిలిచాడన్నారు.  తెలంగాణలో పండుగలా రైతుబంధు వారోత్సవాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతన్నలకు గౌరవం దక్కించిన ఏకైక ప్రభుత్వం టీఆరెస్ అని అన్నారు. రైతన్నలను లక్షాధికారులను చెయ్యడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక రైతు సంస్కరణలను సీఎం తీసుకొచ్చారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement