నకిరేకల్ : సందర్భం ఏదైనా విజయం టీఆర్ఎస్ పార్టీకే సొంతం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయతకు నకిరేకల్ పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు. నకిరేకల్ పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్స్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులతో కలసి ఆయన కొత్తగా ఎన్నికయిన కౌన్సిలర్లను అభినందిం చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటు-లో ఉండాలి అని సూచించారు. అదే సమయంలో ప్రలోభాలకు దూరంగా ఉన్న ప్పుడే ప్రజలకు చేరువ అవుతామన్న విషయాన్ని విస్మరించ రాదని ఆయన ఉద్బోధించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవలని అటు-వంటప్పుడు తిరిగి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం కాగలదని ఆయన చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement