Wednesday, April 24, 2024

వివాహిత ఆత్మ‌హ‌త్య‌…

అనారోగ్య సమస్యలు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న గుర్రంపోడు మండలంలోని ఎల్లమోనిగూడెంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన వాడపల్లి ఏడుకొండలుకు పదేళ్ల క్రితం పుష్పలత (30)తో వివాహమైంది. నాలుగేళ్లుగా పుష్పలత అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీంతో ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement