Thursday, April 25, 2024

జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలి : ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

నల్లగొండ జిల్లా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు కేటాయిస్తూ జీవో 246 తెచ్చిందన్నారు. ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందన్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 246 ని వెంటనే రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement