Saturday, April 20, 2024

కేసీఆర్ కు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయం : వైఎస్ ష‌ర్మిల

కేసీఆర్ కు ప్రజా సమస్యలేవీ పట్టడం లేదని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ష‌ర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈసంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ… మరోసారి యువతను మోసగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు. 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం ఎనభై వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం మోసం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఉన్నత చదవులు చదివిన యువత ఏడేళ్లుగా ఉద్యోగాలు రాక కులవృత్తులకు పరిమితమవుతున్నారని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ప్రతి సమస్య ను ఆకళింపు చేసుకుంటున్నానని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరిస్థిితి ఏంటని షర్మిల నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement