Friday, March 29, 2024

ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి : కడియం శ్రీహరి

నల్లగొండ : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమిదేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వేములపల్లి మండల బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయ‌న్నారు. బీఆర్ఎస్ దేశానికే రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement