Friday, April 19, 2024

నేటి నుంచి తెరాస అభ్యర్థి ప్రచారానికి శ్రీకారం

నల్లగొండ: నేటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారానికి సిద్ధమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రెడ్డి ప్రచారాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం నేతలు, శ్రేణులు కూడా హాజరవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చండూరులో వామపక్ష నేతలతో కలిసి తెరాసా అభ్యర్థి కుసుకుంట్ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు

నేడు తెరాస అభ్యర్థి నామినేషన్..
నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీపీఎం, సీపిఐ నేతల‌తో కలిసి చండూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement